పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి : హుజురాబాద్
- Vijaya Preetham
- Mar 27
- 1 min read
పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి : హుజురాబాద్

సీనియర్ రాజకీయ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె హర్షిత అకాల మరణ వార్త (అమెరికాలో) తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడీ కౌశిక్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటనతో వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న బాధకు మాటలు సరిపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భగవంతుడు హర్షిత ఆత్మకు శాంతిని చేకూర్చాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Comments