top of page

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలి

  • Writer: Vijaya Preetham
    Vijaya Preetham
  • Feb 20
  • 1 min read

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలి


ప్రతి ఓటరును ఇంటింటికి వెల్లి కలవాలి

నిరంతరం సమీక్ష, సమన్వయంతో పని చేయండి



కో-ఆర్డినేటర్ సమీక్ష సమావేశంలో పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ : జమ్మికుంట


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని, దానికి కో-ఆర్డినేటర్ లు సమిష్టిగా, సమన్వయంతో పని చేయాలని పరకాల ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో ఇళ్ళందకుంట, జమ్మికుంట మండల కో-ఆర్డినేటర్ ల సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టభద్రుల హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి పరకాల ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరును నేరుగా ఇంటికి వెళ్లి కలవాలని, పట్టభద్రుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని, పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో నరేందేర్ రెడ్డి గట్టిగా కొట్లాడతారని అన్నారు. ప్రచారం చేసే సమయంలో వారి సమస్యలు తెలుసుకోవాలని,వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments


JOIN OUR MAILING LIST

Sign up to receive exclusive updates, behind-the-scenes content, and more!

  • Instagram
  • Facebook
  • X
  • YouTube
  • Whatsapp

© 2024 Vijaya Preetham. All rights reserved.

bottom of page